తెలంగాణలో బీజేపీ పనై పోయింది.. మంత్రి హరీశ్ రావు

by Dishafeatures2 |
తెలంగాణలో బీజేపీ పనై పోయింది.. మంత్రి హరీశ్ రావు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ పని అయిపోయిందని అన్నారు. బీజేపీలో ఉంటే గెలవటం పక్కన పెడితే డిపాజిట్ కూడా రాదని ఎద్దేవా చేశారు. అందుకు ఆ పార్టీ నేతలు పక్క చూపులు చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్లు వంటి పథకాలు దేశంలో ఎక్కడా కూడా లేవని చెప్పారు. రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని, ఇక కేసీఆర్ ముచ్చటగా మూడోసారి సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed