పేకాట స్థావరంపై దాడి.. 8 మంది అరెస్ట్

by  |
పేకాట స్థావరంపై దాడి.. 8 మంది అరెస్ట్
X

దిశ,మెదక్: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మోహిన్‌పురా రిలయన్స్ మార్ట్ మాల్ వెనకాల ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు జరిపారు. ఎనిమిది మంది పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 19,339 నగదు, 6 మొబైల్ ఫోన్లు, 4 బైక్‌లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పట్టణాల్లో పేకాట, అక్రమంగా మద్యం, గుట్కాలు, అమ్మడం ఎలాంటి చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.

tag: police raids, 8 people arrested, poker bases, siddipet

Next Story

Most Viewed