రాళ్ల దాడి: బాబు వ్యక్తిగత సిబ్బందిని ప్రశ్నించిన పోలీసులు

by  |
రాళ్ల దాడి: బాబు వ్యక్తిగత సిబ్బందిని ప్రశ్నించిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో మాట్లాడుతున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై రాళ్ల దాడి జరగడం ఏపీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఘటనలో ఒక యువకుడితో పాటు మహిళకు గాయాలయ్యాయి. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉండే చంద్రబాబుపై రాళ్ల దాడికి పాల్పడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని పోలీసులు ప్రశ్నించారు. రాళ్లు వేసినవారిని మీరు చూశారా?.. రాళ్లు ఎటువైపు నుంచి వచ్చాయి? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.



Next Story