- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత లోక్ సభ ఎంపీ గౌతమ్ గంభీర్ కు ఇప్పుడు పాక్ నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. ఏకంగా గంభీర్ ను చంపేస్తాం అంటూ ఈ మెయిల్స్ వస్తున్నాయి. ఆరు రోజుల్లోనే మూడు ఈ మెయిల్స్ రావడం కలవరం కలిగిస్తోంది. పాక్ అడ్డాగా నడుస్తున్న ఉగ్రమూకల నుంచే ఈ ఈమెయిల్స్ వచ్చినట్టు నిఘా వర్గాలు తెలిపాయి. ఐసిస్ కశ్మీర్ పేరుతో ఈ ఈమెయిల్స్ వచ్చినట్టు సమాచారం.
పోలీసుల్లో కూడా మా కోసం పని చేసే వాళ్లు ఉన్నారని, మీ పోలీసులు, ఐపీఎస్ అధికారి శ్వేతా చౌహాన్ మమ్మల్ని ఏమీ చేయలేరు అంటూ మూడో ఈమెయిల్ రావడంతో అప్రమత్తం అయ్యాడు గంభీర్. కుటుంబసమేతంగా నిన్ను మట్టుబెడతాం అని అందులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. తొలి మెయిల్ వచ్చిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. గంభీర్ ఇంటికి కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. అయితే భద్రత పెంచిన రెండో రోజే గంభీర్ ఉంటున్న ఇంటిని వీడియో తీసి రెండో ఈమెయిల్ కి జత చేసి పోస్ట్ చేయడం కలకలం రేపింది.
గూగూల్ ను సంప్రదించిన ఢిల్లీ పోలీసులు అసలు విషయాన్ని రాబట్టారు. పాకిస్తాన్ లో ఉంటున్న ఒక విద్యార్థి పేరు మీద ఉన్న మెయిల్ నుంచి ఇవి వచ్చాయని గుర్తించారు. అయితే ఇలా తరచూ ఈ మెయిల్స్ రావడం వెనుక ఏం జరుగుతోందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాక్ ఉగ్రమూకలు గంభీర్ ను టార్గెట్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నలు మొదలయ్యాయి.