- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మానేరులో నీటి ప్రవాహాన్ని చూసేందుకు వెల్లిన బాబు నీటిలో జారి పడగా, అతన్ని కాపాడేందుకు నీటిలోకి దూకిన పెద్దమ్మ దుర్మరణం చెందింది. ఘటన వివరాల్లోకి వెలితే.. మానకొండూరు మండలం సదాశివపల్లిలోని దర్గాలో ప్రార్థనలు చేసేందుకు కరీంనగర్ కశ్మీర్ గడ్డకు చెందిన సకినా (31) ఆమె చెల్లెలి కొడుకు అహిల్(3)తో కలిసి వెళ్లింది. ఈ దర్గా మానేరు నది ఒడ్డున ఉండటంతో నీటి ప్రవాహాన్ని చూసేందుకు వెల్లి నదిలో అహిల్ జారి పడిపోయాడు. ఈ విషయాన్ని పెద్దమ్మ సకినా గమనించింది. అహిల్ ను కాపాడేందుకు నీటిలోకి ఆమె దూకింది. సమాచారం అందుకున్న మానకొండూరు, ఎల్ఎండీ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక యువకులతో కలిసి గాలింపు చర్యలను చేపట్టారు.
కాగా దాదాపు గంటసేపు నీటిలో గాలించగా సదాశివపల్లి సమీపంలోనే సకినా మృతదేహం లభ్యం అయింది. మరో చోట అపస్మారక స్థితిలో అహిల్ చిక్కడంతో అతన్ని హుటాహుటిన కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.