- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
హీరోయిన్ నిక్కీ గర్లాని.. ‘తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని.. దేవుడి దయవల్ల కోలుకున్నానని’ రెండు రోజుల క్రితం తెలిపింది. తమిళ్లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఈ భామ.. తెలుగులో బలుపు, మరకతమణి చిత్రాల్లో నటించింది. కాగా కరోనా నిర్ధారణ అయ్యాక తను ఎలాంటి అనుభవం పొందిందో తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టింది నిక్కీ.
కరోనా అంటే జనాల్లో అనవసర భయం ఉందని.. అందుకే దీని గురించి వివరించేందుకు ముందుకొచ్చినట్లు తెలిపింది. గొంతు నొప్పి, జ్వరంతో బాధపడిన తాను వాసన, రుచి కోల్పోయానని తెలిపింది. టెస్ట్ చేయించగా కరోనా నిర్ధారణ కావడంతో హోమ్ క్వారంటైన్లో ఉన్నట్లు చెప్పింది. తనకు ఇంతకు ముందు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు గనుక కరోనాను జయిస్తాననే నమ్మకంతో ఉన్నప్పటికీ.. అమ్మానాన్న, పెద్దలు, స్నేహితుల గురించి ఆలోచిస్తే భయం వేసిందన్నారు. తన వల్ల పెద్దలు, చిన్నపిల్లలు ఎఫెక్ట్ అయితే క్రిటికల్ కండిషన్ ఉంటుందని, తనకుతానే దూరంగా ఉన్నట్లు చెప్పింది.
ప్రతీ ఒక్కరు కూడా తమతో పాటు తమ చుట్టూ ఉన్న వారి గురించి ఆలోచించాలని, మాస్క్ ధరించాలని కోరింది. భౌతిక దూరం పాటించడంతో పాటు చేతులను తరచు శుభ్రంగా కడుక్కోవాలని సూచించింది. అత్యవసరం అయితే తప్ప బయటకెళ్లకూడదని హెచ్చరించింది నిక్కీ. 24 గంటలు ఇంట్లో కూర్చునేందుకు ఫ్రస్ట్రేషన్ వస్తుందని తెలుసు కానీ.. ఇలాంటి విపత్కర సమయాల్లో సమాజం కోసం మనం బాధ్యతగా మెలగాల్సిన అవసరం ఉందని చెప్పింది. కుటుంబంతో గడుపుతూ, ఫ్రెండ్స్తో టచ్లో ఉంటూ.. మెంటల్ కండిషన్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలని చెప్పుకొచ్చింది నిక్కీ. డిప్రెషన్ ఫీల్ అయితే తప్పకుండా డాక్టర్ను సంప్రదించాలని సూచించింది.