- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ఐపీఎల్ ప్లేఆఫ్స్ సమయంలో బీసీసీఐ మహిళా జట్లతో టీ20 ఛాలెంజ్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ముంబైలో మూడు జట్లతో ఈ ఛాలెంజ్ నిర్వహించిన బీసీసీఐ..ఈ సారి జైపూర్లో నాలుగు జట్లతో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సారి కూడా ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచులు జరిగే సమయంలోనే ఈ టీ20 ఛాలెంజ్ మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది.
2018లో హర్మన్ప్రీత్ సారథ్యంలో సూపర్ నోవాస్, స్మృతి మంధానా సారథ్యంలో ట్రయల్బ్లేజర్స్ జట్లు బరిలో దిగాయి. 2019లో ఈ రెండు జట్లకు తోడు మిథాలీ రాజ్ సారథ్యంలోని మరో జట్టు కూడా బరిలో నిలిచింది. ఇక ఈసారి నాలుగు జట్లు పాల్గొంటాయని ఐపీఎల్ యాజమాన్యం పేర్కొంది.
స్వదేశీ, విదేశీ ఆటగాళ్లతో కూడిన ఈ ఛాలెంజర్లో కొత్తగా రాబోయే టీమ్ను మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు. మహిళా టీ20 వరల్డ్ కప్ అనంతరం ఈ జట్టును ప్రకటించే అవకాశం ఉంది.
Next Story