పెండ్లి అయిన తెల్లారే తీరని శోకం

by  |
పెండ్లి అయిన తెల్లారే తీరని శోకం
X

దిశ, వెబ్‌డెస్క్: పెండ్లి మురిపం ఇంకా తీరనే లేదు. కానీ, ఆ పెళ్లింట్లో ఒక్కసారిగా తీరని విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదం నవ వరుడిని పొట్టన పెట్టుకుంది. చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం రెంచన్న రెడ్డిగారిపల్లెలో జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ప్రమాదంలో నవ వరుడు చాంద్ బాషా (22)కు తీవ్రగాయాలు అయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే ప్రాణాలు విడిచాడు. నవ వరుడి మృతి వార్త విన్న కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, మృతుడి భార్య పరిస్థితి ప్రశ్నార్థకంగా మారడం బాధాకరం.



Next Story

Most Viewed