- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాతరలో ఘోరం : కుప్పకూలిన భారీ జెయింట్ వీల్.. 40 మందికి పైగా గాయాలు
ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ జిల్లాలో నిర్వహించిన భైసాహా మేళాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ జిల్లాలో నిర్వహించిన భైసాహా మేళాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి సుమారు 80 మందితో తిరుగుతున్న 60 అడుగుల భారీ జెయింట్ వీల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో మహిళలు, పిల్లలతో సహా 40 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అధికారులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. జాతరలో ఆనందంగా గడుపుతున్న సమయంలో ఒక్కసారిగా ఈ దుర్ఘటన జరగడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది.
నెల క్రితం హర్యానాలో..
సరిగ్గా నెల రోజుల క్రితం హర్యానాలోని ఫరీదాబాద్ సూరజ్కుండ్ జాతరలో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. అప్పుడు భారీ జెయింట్ వీల్ (ఆకాశ ఊయల) కుప్పకూలిన ఘటనలో ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిబంధనలు పాటించకుండా ఏర్పాటు చేస్తున్న ఇలాంటి భారీ రంగుల రాట్నాల వల్ల ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






