భారత్ జోడో యాత్రకు ఒకరోజు బ్రేక్!.. 24నుంచి యాత్ర కొనసాగింపు

by Disha Web Desk 21 |
భారత్ జోడో యాత్రకు ఒకరోజు బ్రేక్!.. 24నుంచి యాత్ర కొనసాగింపు
X

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ జారీ కావడంతో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు స్వల్ప విరామం ప్రకటించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాహుల్ ఢిల్లీ వెళ్లడంతో యాత్రకు ఒక రోజు బ్రేక్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నాయి. అయితే ఎన్నికల బరిలో రాహుల్ ఉన్నారా లేదా అనే విషయమై ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో రాహుల్ ఢిల్లీ వెళ్లడం ఆసక్తికరంగా మారింది. శనివారం తన సోదరి ప్రియాంక గాంధీతో కలసి యాత్రను తిరిగి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన పార్టీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 24 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్న సంగతి తెలిసిందే.

రాహుల్ నామినేషన్ వేసేది లేనిది శనివారం స్పష్టత రానుంది. మరోవైపు గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో పార్టీ భవిష్యతు అధ్యక్షుడు భారత్ విజన్‌కు ప్రాతినిథ్యం వహిస్తారని గుర్తుంచుకోవాలని రాహుల్ అన్నారు. 150 రోజుల పాటు సాగనున్న భారత్ జోడో యాత్ర ఈ నెల 7న కన్యాకుమారిలో ప్రారంభమైంది. దేశంలో ప్రజలను కలిసి సమస్యలను తెలుసుకునేందుకు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా ఈ యాత్ర చేపట్టింది. 12 రాష్ట్రాల గుండా సుమారు 3,500 కిలోమీటర్లకు పైగా యాత్ర సాగనుంది. ప్రస్తుతం కేరళలో యాత్ర కొనసాగుతుంది.


Next Story

Most Viewed