దేశం మొత్తం బాధపడుతోంది.. జస్టిస్ గవాయ్‌‌పై దాడిని ఖండించిన ప్రధాని

by Gantepaka Srikanth |

సుప్రీంకోర్టు(Supreme Court)లో అనూహ్య ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

దేశం మొత్తం బాధపడుతోంది.. జస్టిస్ గవాయ్‌‌పై దాడిని ఖండించిన ప్రధాని
X

దిశ, వెబ్‌డెస్క్: సుప్రీంకోర్టు(Supreme Court)లో అనూహ్య ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ (CJI Justice BR Gavai)పై దాడి చేసేందుకు ఓ న్యాయవాది యత్నించాడు. దీనిపై పార్టీలకు అతీతంగా అందరూ ఖండించారు. తాజాగా ఈ ఘటనపై ప్రధాని మోడీ(PM Modi) స్పందించారు. జస్టిస్ గవాయ్‌కు ఫోన్ చేశారు. గవాయ్‌పై జరిగిన దాడిని ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘనటలకు తావు లేదని పేర్కొన్నారు. ఈ ఘటనను చూసి ప్రతీ భారతీయుడూ బాధపడుతున్నాడని వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనపై ఇప్పటికే స్పందించిన గవాయ్.. ఇలాంటి బెదిరింపులు తనను ప్రభావితం చేయలేవన్నారు. అనంతరం ఘటనకు కారణమైన న్యాయవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story