- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మహిళలు మృతి
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ట్రాలీని లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మహిళలు మృతి చెందగా, 20 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం ఫర్డ్పూర్ గ్రామ సమీపంలో తెల్లవారుజామున 4 గంటలకు జరిగింది. కున్వర్పూర్ గ్రామానికి చెందినటువంటి వీరేంద్ర సింగ్ లోధి రాజ్పుత్ శుక్రవారం తన కుటుంబంతో కలిసి ప్రక్కన బెల్ధరా గ్రామంలో ఉంటున్నటువంటి తన కూతురు కొడుకు నామకరణ ఫంక్షన్కు హాజరయ్యారు. తిరిగి వస్తున్న క్రమంలో ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
మొత్తం 35 మందితో ఉన్నటువంటి ట్రాక్టర్ లైట్ చెడిపోవడంతో దానిని రోడ్డు పక్కన ఆపి రిపేర్ చేస్తుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ దానిని బలంగా ఢీ కొనడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. 35 మందిలో దాదాపు 25 మంది వరకు మహిళలు ఉన్నారు. ఫుల్మాట్ (35), రమాకాంతి దేవి (45), సంజయ్ దేవి (30) అక్కడికక్కడే మృతి చెందగా, ద్రోపది దేవి (40) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన మిగతా 20 మందిని సఫాయి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.