ప్రజలకు సేవ చేసే వారిని ఆదరించాలి

by Disha Web Desk 15 |
ప్రజలకు సేవ చేసే వారిని ఆదరించాలి
X

దిశ, కొండపాక : ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేసే నాయకులను ఎన్నుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. మెదక్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఆయన కుమారుడు సుప్రీత్ రెడ్డి తో పాటు బీఆర్ఎస్ నాయకులు కొండపాక మండలం సిరసనగండ్ల , గిరాయిపల్లి గ్రామాల్లో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ బొద్దుల కనకయ్య

మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే పూర్తిగా విఫలమైందన్నారు. ఆరు గ్యారెంటీల అమలు చేయకపోవడంతో పాటు ప్రజలను మోసం చేసే మాటలు మాట్లాడుతుందన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలను వివరించి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి అనంతల ప్రశాంత్, బీఆర్ ఎస్ నాయకులు నూనె కుమార్, రాగల దుర్గయ్య, గోనె శ్రీనివాస్, మహిపాల్ రెడ్డి, ప్రశాంత్, మల్లేశం, రాజిరెడ్డి , సురేందర్ రెడ్డి, రాధా కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed