- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దేశంలో నివసించే ప్రతి ఒక్కరూ హిందువే: ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్
రాయ్పూర్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో నివసించే ప్రతి ఒక్క వ్యక్తి హిందువేనని అన్నారు. భారతీయులందరి డీఎన్ఏలు ఒకటేనని, ఏ ఒక్కరూ తమ ఆచారాలను మార్చుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్లో మంగళవారం నిర్వహించిన స్వయంసేవకుల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం పురాతన లక్షణమని అన్నారు. ప్రపంచంలో అందరినీ తమ వెంట తీసుకెళ్లడాన్ని విశ్వసించే ఏకైక ఆలోచన హిందుత్వం అని పేర్కొన్నారు.
'ప్రపంచంలోని భిన్నాభిప్రాయాలను ఏకీకృతం చేయడాన్ని విశ్వసించే ఏకైక ఆలోచన హిందుత్వం. ఎందుకంటే ఈ దేశం వేలాది సంవత్సరాలుగా భిన్నత్వాన్ని కలిగి ఉంది. దాని ఆధారంగా మనం ఐక్యంగా ఉండగలం. సంఘ్ పని వ్యక్తిగత, జాతీయ స్వభావాన్ని నిర్మించడంతో పాటు ప్రజల మధ్య ఐక్యతను తీసుకురావడం' అని చెప్పారు.
మనం ఎంత పోట్లాడుకున్న, మన సంస్కృతే మనల్ని కలుపుతుందని అన్నారు. కరోనా విపత్కర సమయంలో దేశమంతా ఒక్కటై పోరాడామని చెప్పారు.