- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కాంగ్రెస్ 'అన్నాచెల్లె' పార్టీ.. బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ లేదా భారత పార్టీ కాదని అన్నా చెల్లె పార్టీ అని అన్నారు. ప్రజాస్వామ్య పాలనకు కుటుంబ పార్టీలతో ప్రమాదం అనే అంశంపై గురువారం ఏర్పాటు చేసిన సెమినార్ లో ఆయన ప్రసంగించారు. కుటుంబ పార్టీలు, ఒక వ్యక్తి విధానమే సర్వోన్నతంగా ఉంటుంది. ఎలాంటి భావజాలం లేకుండా, ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిగణిస్తుంది అని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కుటుంబ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని, వీటి ఎదుగుదలకు కాంగ్రెస్ ప్రధాన కారణమని నడ్డా నిందించారు.
జాతీయ రాజకీయాలపై ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో ప్రాంతీయ ఆకాంక్షలకు చోటు కల్పించని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్సేనని ఆరోపించారు. 'అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ జాతీయ లేదా భారతీయ లేదా ప్రజాస్వామ్య పార్టీ కాదనే విషయం. ఈ పార్టీ ప్రస్తుతం కేవలం అన్నాచెల్లె పార్టీగానే ఉంది' అని రాహుల్, ప్రియాంక గాంధీల నుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. అంతర్గత ప్రజాస్వామ్యాన్ని నిర్వహిస్తున్నది బీజేపీ మాత్రమేనని ఆయన చెప్పారు.