CM హెలికాప్టర్‌లో రోగి తరలింపు.. షెడ్యూల్ రద్దు చేసుకున్న ముఖ్యమంత్రి

by Disha Web Desk 12 |
CM హెలికాప్టర్‌లో రోగి తరలింపు.. షెడ్యూల్ రద్దు చేసుకున్న ముఖ్యమంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: CM హెలికాప్టర్‌లో రోగిని ఆస్పత్రికి తరలించడంతో ముఖ్యమంత్రి షెడ్యూల్ రద్దు చేసుకున్నారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చంబా జిల్లాలోని కిల్లర్ ప్రాంతంలో ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఆ ప్రాంతం పూర్తిగా కొండల ప్రాంతం. అయితే అదే సందర్భంలో అక్కడే పర్యటనలో ఉన్న.. ముఖ్కమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు అతని ప్రాణాలు కాపాడటానికి తన హెలికాప్టర్ లో రోగిని తండాలోని వైద్య కళాశాలకు తరలించారు. ఈ సందర్భంగా తనకు షెడ్యూల్ అయిన పర్యటనను రద్దు చేసుకన్నారు. అలాగే.. రోగికి ఉచితంగా వైద్య చికిత్స అందించాలని ముఖ్యమంత్రి స్వయంగా ఆసుపత్రి అధికారులకు ఫోన్ చేసి ఆదేశించారు.

Next Story

Most Viewed