అదానీ వెనుక అదృశ్య శక్తి.. ఎవరనేది దేశం మొత్తం తెలుసుకోవాలి: రాహుల్ గాంధీ

by Disha Web Desk 17 |
అదానీ వెనుక అదృశ్య శక్తి.. ఎవరనేది దేశం మొత్తం తెలుసుకోవాలి: రాహుల్ గాంధీ
X

న్యూఢిల్లీ: సంచలనంగా మారిన అదానీ వ్యవహరంపై చర్చను వీలైనంత తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ విషయంపై చర్చకు కేంద్రం భయపడుతుందని ఆరోపించారు. బిలియనీర్ వ్యాపారవేత్త వెనుక ఎవరున్నారనే విషయం దేశం మొత్తం తెలియాలని అన్నారు. దేశ రాజధానిలో రాహుల్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో అదానీ వ్యవహరంపై చర్చను తగ్గించేందుకు మోడీ సాధ్యమైనంతగా ప్రయత్నిస్తున్నారు. దీనికి కారణం ఏంటో మీకు తెలుసు.

'అదానీ వ్యవహరంపై చర్చ జరిగి వాస్తవం బయటకు రావాలని నేను కోరుతున్నాను. లక్షల కోట్ల అవినీతి వెలుగులోకి రావాలి. అదానీ వెనుక ఏ శక్తి ఉందనేది దేశం కూడా తెలుసుకోవాలి. పార్లమెంటు ఈ అంశంపై చర్చ జరిపేందుకు ప్రభుత్వం అనుమతివ్వాలి' అని అన్నారు. ఇప్పటికే అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టు లేదా పార్లమెంట్ జాయింట్ కమిటీతో నిష్పక్షపాత దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.


Next Story

Most Viewed