ఒక అమ్మాయి ఆటోలో.. మరో అమ్మాయి ఎగ్జామ్ సెంటర్‌లో.. మొత్తానికి అడ్డంగా దొరికిపోయారుగా!

by Sujitha Rachapalli |

బిలాస్‌పూర్‌లో షాకింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. చత్తీస్‌గఢ్ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలలో బురఖా ధరించిన మహిళ హై-టెక్ పరికరాలతో మోసం చేస్తూ పట్టుబడింది. బిలాస్‌పూర్‌లో జరిగిన PWD సబ్-ఇంజనీర్ నియామక పరీక్షలో ఈ ఘటన జరిగింది.

ఒక అమ్మాయి ఆటోలో.. మరో అమ్మాయి ఎగ్జామ్ సెంటర్‌లో.. మొత్తానికి అడ్డంగా దొరికిపోయారుగా!
X

దిశ, వెబ్ డెస్క్: బిలాస్‌పూర్‌లో షాకింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. చత్తీస్‌గఢ్ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలలో బురఖా ధరించిన మహిళ హై-టెక్ పరికరాలతో మోసం చేస్తూ పట్టుబడింది. బిలాస్‌పూర్‌లో జరిగిన PWD సబ్-ఇంజనీర్ నియామక పరీక్షలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు సోదరీమణులు స్పై కెమెరా, వాకీ-టాకీ వంటి హై-టెక్ పరికరాలను ఉపయోగించి సమాధానాలను ఒకరికొకరు చేరవేస్తూ కాపీ చేశారు. ఒక అమ్మాయి పరీక్షా హాల్‌లో ఉండగా.. మరో అమ్మాయి ఆటో-రిక్షాలో బయట టాబ్లెట్, వాకీ-టాకీ ద్వారా సమాధానాలు అందించింది. సర్కందలోని రామ్‌దులారే స్కూల్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ కాగా.. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

VIDEO

Next Story