ఎన్నికల ముగిశాక బీజేపీ ఎంపీ అభ్యర్ధి హటాన్మరణం!

by Disha Web Desk 5 |
ఎన్నికల ముగిశాక బీజేపీ ఎంపీ అభ్యర్ధి హటాన్మరణం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభ ఎన్నికలు ముగిసిన వేళ బీజేపీ ఎంపీ అభ్యర్ధి మృతి చెందిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేసిన బీజేపీ అభ్యర్ధి కున్వర్ సర్వేష్ కుమార్ సింగ్ గుండెపోటుతో మరణించారు. గుండెపోటు కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న కున్వర్ సర్వేష్ మృతి చెందినట్లు మొరాదాబాద్ నగరానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రితేష్ గుప్తా తెలియజేశారు. కాగా నిన్న దేశ వ్యాప్తంగా జరిగిన మొదటి విడత ఎన్నికల్లో మొరాదాబాద్ పార్లమెంట్ స్తానం నుంచి బీజేపీ అభ్యర్ధిగా కున్వర్ బరిలో నిలిచారు. పెద్ద వ్యాపారవేత్తగా ఉన్న కున్వర్ సర్వేష్, ఠాకూర్‌ద్వారా నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మొరాదాబాద్ నుంచి ఒకసారి ఎంపీగా గెలుపొందారు. తన కుమారుడు కున్వర్ సుశాంత్ సింగ్ ప్రస్తుతం బర్హాపూర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు.



Next Story

Most Viewed