- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అదానీ గ్రూప్ బాసట
by Javid Pasha |
ఒడిశా రైలు ప్రమాదంలో 288 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉండేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చింది.

X
దిశ, వెబ్ డెస్క్: ఒడిశా రైలు ప్రమాదంలో 288 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉండేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచితంగా పాఠశాల విద్యను అందిస్తామని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. బాలాసోర్ రైలు ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. బాధితులను ఆదుకోవాల్సిన ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు.
ఇక ఈ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని మేం నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే వారి పాఠశాల విద్యకు అయ్యే ఖర్చును అదానీ గ్రూప్ భరిస్తుందని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Next Story






