- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీపై మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్య బాణాలు విసిరారు. ఆయన్ని ట్యూబ్లైట్తో పోల్చారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ‘మరో ఆరు నెలల్లో నరేంద్ర మోదీని యువకులు కర్రలతో కొడతారని ప్రతిపక్ష ఎంపీ ఒకరు అనడం విన్నాను. ఇక మీదట సూర్యనమస్కారాలు ఎక్కువ సేపు చేయాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే, తిట్లను తట్టుకొనే శక్తి పెరగాలి కాబట్టి. అయినా గత రెండు దశాబ్దాలుగా కారణం ఏదైనా నన్ను తిడుతూనే ఉన్నారు. వాటిని ఎదుర్కొని, ఎదుర్కొని ప్రతిపక్షాల తిట్లను తట్టుకొనే సామర్థ్యం పెరిగిపోయింది’ అని అన్నారు. దాదాపు మోదీ ప్రసంగం పూర్తవుతుందన్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లేచి నిలబడ్డారు. ప్రధాని ప్రసంగానికి అడ్డు తగిలారు. గందరగోళం కారణంగా మోదీ ఏం మాట్లాడారో వినిపించలేదన్నారు. దీనిపై నరేంద్ర మోదీ వ్యంగ్యంగా స్పందించారు. ‘గత 40 నిమిషాలుగా నేను మాట్లాడుతున్నాను. ఆయనలో కరెంట్ ఇప్పుడు సరఫరా అయింది. కొన్ని ట్యూబ్లైట్లు ఇలాగే పనిచేస్తాయి’ అని మోదీ ఎద్దేవా చేశారు.