- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, నల్లగొండ: పార్టీలకతీతంగా పేదలకు ప్రతి ఒక్కరూ సేవ చేయాలని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లాలోని చండూరు మున్సిపాలిటీ, నాంపల్లి , మర్రిగూడెం మండలాల్లోని పేదలకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీకు సాయం చేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. ఇందులో తన గొప్పతనం ఎమీలేదని, సేవ చేసే ఆలోచన భగవంతుడు కల్పించడాని చెప్పారు. సరుకుల పంపిణీలో తనకు సహకరిస్తున్న ప్రతి నాయకుడికి కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా చేపట్టిన సేవా కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని.. ఆర్ధికంగా స్థిరపడిన ప్రతిఒక్కరూ సాయం చేసేందుకు ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. లాక్డౌన్ సమయంలో వలస కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని, సమాజం పట్ల బాధ్యత గల పౌరులు వారికి అండగా ఉండేందుకు ముందుకు రావాలన్నారు. కరోనా నివారణకు లాక్డౌన్ ఎత్తివేసిన 6నెలల వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చేనేత కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నారని వారికి ప్రత్యేకంగా సాయం చేస్తానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
tags: no political parties, munugode mla rajagopal reddy, do service for poor people