మీ నమ్మకాన్ని వమ్ము చేయను : తోట జనార్ధన్

by  |
మీ నమ్మకాన్ని వమ్ము చేయను : తోట జనార్ధన్
X

దిశ, కాటారం : మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన మండల శాఖ అధ్యక్షుడు ఎంపీటీసీ తోట జనార్ధన్ అన్నారు. మంగళవారం గారేపల్లి అంబేద్కర్ కూడలిలో ఆయన ఎన్నిక పట్ల టపాసులు కాల్చి విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తోట జనార్దన్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో రెండోసారి పార్టీ అధ్యక్షులు బాధ్యతలు అప్పగించినందుకు నియోజకవర్గ ఇంచార్జి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ జక్కు హర్షిణి రాకేష్‌లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అంతేకాకుండా కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ రామిళ్ల కిరణ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాయితపు విఠల్, మాజీ సింగిల్ విండో ఛైర్మెన్ తుల్సేగారి శంకర్, మండల సీనియర్ నాయకులు ఊర వెంకటేశ్వర రావు, మందల లక్ష్మారెడ్డి, దబ్బెట రాజేష్, ఎంపీటీసీ బాసాని రవి, రైతు సమన్వయ అధ్యక్షుడు కుడుదుల రాజ బాపు, ఎస్సీ సెల్ నియోజక వర్గ అధ్యక్షులు బుపెళ్ళీ రాజు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed