శాస్త్రోక్తంగా భూమిపూజ.. భక్తితో పాల్గొన్న రాజకీయ నాయకులు

by  |
శాస్త్రోక్తంగా భూమిపూజ.. భక్తితో పాల్గొన్న రాజకీయ నాయకులు
X

దిశ, మియాపూర్: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మదీనాగూడ, అభయాంజనేయ స్వామి దేవాలయ పునఃనిర్మాణ భూమిపూజ కార్యక్రమం గురువారం జరిగింది. శ్రీ తోగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి ఈ పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ, కార్పొరేటర్లు పూజిత గౌడ్, జగదీశ్వర్ గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ పునఃనిర్మాణం చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా త్వరితగతిన నిర్మాణం పూర్తి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వినోద్ రావు, హరీష్ వాలా, శ్రీనివాస్ గౌడ్, ప్రసాద్, మల్లేష్, ఆంజనేయులు, జనార్ధన్ గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed