ప్రేమకథా చిత్రాల్లో ట్రెండ్ సెట్టర్‌గా 'సీతారామపురం'

by Disha Web Desk 21 |
ప్రేమకథా చిత్రాల్లో ట్రెండ్ సెట్టర్‌గా సీతారామపురం
X

దిశ, సినిమా : రణధీర్‌, నందిని జంటగా నటించిన చిత్రం 'సీతారామపురం'. ఎం. వినయ్‌ బాబు దర్శకత్వంలో శ్రీ ధనలక్ష్మీ మూవీస్‌ పతాకంపై బీసు చందర్‌ గౌడ్‌ నిర్మించిన ఈ ప్రేమ కథాచిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకనిర్మాతలు సినిమా విశేషాలు వెల్లడించారు. 'విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే విభిన్నమైన ప్రేమకథా చిత్రమిది.

ఇప్పటి వరకు గ్రామీణ నేపథ్యంలో ఎన్నో ప్రేమకథా చిత్రాలు వచ్చాయి. కానీ వాటికి, మా చిత్రానికి ఎంతో డిఫరెన్స్‌ ఉంది. కచ్చితంగా ఇదొక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తుంది. అంతర్లీనంగా మంచి సందేశం కూడా ఉంటుంది. మంచి కంటెంట్‌తో పాటు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. టీజర్‌, పాటలకు అత్భుతమైన స్పందన వస్తోంది. యువతతో పాటు పేరెంట్స్ కూడా చూడాల్సిన చిత్రమిది. తెలుగు ప్రేక్షకులందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం' అన్నారు.

ఇవి కూడా చదవండి : బెస్ట్ కపుల్.. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed