- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆ కారణంగా 20 ఏళ్లు మాట్లాడుకోవడం మానేసిన ఎన్టీఆర్, కె. విశ్వనాథ్!
దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో స్టార్స్ మధ్య బంధాలు, విభేదాలు చాలా కామన్. కొంత మంది స్టార్స్ సొంత అన్నదమ్ముల్ల కలిసి మెలిసి ఉంటారు. అలాగే ఒక్కసారి గొడవ అయితే మాత్రం ఏళ్లతరబడి మాట్లాడుకోవడం మానేస్తుంటారు. ఈ క్రమంలోనే సీనియర్ ఎన్టీఆర్, కె విశ్వనాథ్ మధ్య కూడా ఓ చిన్న ఇష్యూ వచ్చిందట. ఈ కారణంగా వారిద్దరూ ఏకంగా 20 ఏళ్ళు మాట్లాడుకోవడం మానేశారట. ఇంతకి ఆ గొడవ ఏంటో తెలుసుకుందాం.
మన సీనియర్ ఎన్టీఆర్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన హీరోగా ఎన్నో మంచి సినిమాలు అందించారు. అలాగే ఓ మంచి నాయకుడిగా ఎన్నో సేవలు చేశారు. ఇప్పటి జనరేషన్కు కూడా సీనియర్ ఎన్టీఆర్ గురించి తెలుసంటే అతిశయోక్తి కాదు. ఇక ఎన్టీఆర్కు ఇండస్ట్రీలో ఓ మంచి స్నేహితుడు అంటే కె. విశ్వనాథ్. వీరు ఇద్దరు మొదట్లో ఎంతో స్నేహ భావంతో ఉండే వారట. అంతే కాకుండా వీరిద్దరూ కూడా ఒకే కాలేజిలో చదువుకున్నట్లు కూడా తెలస్తోంది. అంత స్నేహంగా ఉండే వీరిద్దరి మధ్యలో అసలు గొడవ ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం.
ఒకానొక సమయంలో.. ఎన్టీఆర్, కె విశ్వనాథ్ కాంబినేషన్లో సినిమా షూటింగ్ జరుగుతోందట. అప్పుడు ఒక ఎమోషనల్ సీన్లో కళ్ళద్దాలు పెట్టుకుని చేయాలని ఎన్టీఆర్ అన్నారట. కానీ కళ్లద్దాలు పెట్టుకుంటే ఎమోషన్ కనిపించదు తీసేసి చెయ్యండి అని విశ్వనాథ్ అన్నారట. దానికి ఏ మాత్రం ఒప్పుకోలేదట ఎన్టీఆర్. ఇక వీరిద్దరూ ఎవరి పంతంపై వారు ఉండటంతో చిన్న ఇష్యూ కాస్త పెద్దది అయిందట. ఈ కారణం చేత ఎన్టీఆర్, విశ్వనాథ్ 20 ఏళ్ల పాటు మాట్లాడుకోకుండా ఉన్నారట.