వార్తల్లో నిలిచిన నాగార్జున - అమల...!

by Disha Web Desk 9 |
వార్తల్లో నిలిచిన నాగార్జున - అమల...!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో నెట్టింట అక్కినేని స్టార్ హీరోలు ఏ రేంజ్‌లో ట్రోలింగ్ కి గురవుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా నాగచైతన్య - శోభిత ప్రేమ వ్యవహారం గురించి నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల ఎక్కడ చూసినా చైతు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. అయినప్పటికీ అవి ఏం పట్టించుకోకుండా నాగార్జున - అమల తాజాగా.. ఓ నిర్ణయం తీసుకొని సినీ ఇండస్ర్టీకి షాక్ ఇచ్చారు. ‘‘ ఇండస్ట్రీలో పని చేయాలని ఎంతో మందికి ఆసక్తి ఉంటుంది కదా.. కానీ వారి టాలెంట్‌ని చూపించుకునే అవకాశం లేక ఛాయిస్‌ని ఎంచుకోలేక కొంతమంది బాధపడుతూ ఉంటారు. అయితే అలాంటి వారికి అన్నపూర్ణ స్టూడియోస్ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది.

‘‘ మీలో మంచి టాలెంట్ ఉంటే మీ ఆలోచనలు మాకు షేర్ చేయండి, మీ లైఫ్‌ను ఛేంజ్ చేసుకోండి’’ అంటూ నాగార్జున, అమల ఓ వీడియోని విడుదల చేశారు. అయితే ‘‘ ద నెక్స్ట్ బిగినింగ్’’ అనే కార్యక్రమంతో టాలెంట్ ఉన్నవాళ్లని తానే పరిశ్రమకి పరిచయం చేస్తానని చెప్పారు. ఆసక్తి గలవారు వీడియోలో ఉన్న నెంబర్‌కు వాట్సప్ చేసి అప్లై చేసుకోండని తెలిపారు. ఒకవైపు కొడుకుల జీవితాలు సెటిల్ కాక.. అలా ఉంటే ఇప్పుడు నాగార్జున ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇంతవరకు కరెక్ట్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది ఏమో ఇప్పటికైనా కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ ఒక అడుగు వేశావ్ అదే గొప్ప విషయం అంటూ నాగార్జునపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ర్టీలో ఇది హాట్ టాపిక్‌గా మారింది.

Next Story

Most Viewed