హిమచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి మార్పు.. క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ జేపీ నడ్డా

by Dishanational2 |
హిమచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి మార్పు.. క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
X

దిశ, వెబ్‌డెస్క్ : హిమచల్ ప్రదేశ్ సీఎంను మార్చనున్నారనే వార్తలపై బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా స్పందించారు. సీఎం జైరాం ఠాకూర్ నాయకత్వంలోనే బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టతనిచ్చారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హిమచల్ ప్రదేశ్ లో బీజేపీ సీఎంను మారుస్తుందనే వార్తలు వచ్చాయి. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ను సీఎంగా నియమిస్తారని వార్తలు వచ్చాయి. దీనిపై నడ్డా స్పందిస్తూ.. జైరాం ఠాకూర్ బాగా పని చేస్తున్నారు. ఆయన పదవిలో కొనసాగుతారు అని అన్నారు. హిమచల్ ప్రదేశ్ నుంచి ఏ మంత్రి కూడా మారడం లేదని తెలిపారు. అయితే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలలో 15 శాతం మందికి టిక్కెట్టు ఇచ్చే అవకాశం లేదని చెప్పారు. తమ పార్టీనే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు ఉందనుకున్నప్పటికీ, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ సారి తన ముద్ర వేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

Next Story

Most Viewed