Guppedantha Manasu: మను గురించి చెబుతూ ఎమోషనల్ అయిన అనుపమ

by Disha Web Desk 10 |
Guppedantha Manasu: మను గురించి చెబుతూ ఎమోషనల్ అయిన అనుపమ
X

దిశ, సినిమా: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

అందరూ భోజనానికి వస్తారు.ఇదే మంచి సమయం అనుకుని ఏంజెల్ ప్లాన్ వేసి తల్లి కొడుకులను కలపాలని అనుకుంటుంది. మను ఏమో అనుప‌మ‌కు ఎదురుగా కూర్చోవాల‌ని చాలా ఆశ పడతాడు. కానీ, ఏంజెల్‌ మాత్రం తెలివిగా ఆలోచించి మనుని, వాళ్ల అమ్మ ప‌క్కనే కూర్చొనేలా చేస్తుంది. అది అంతా చూస్తున్న అనుప‌మ ఏం అన‌లేక‌ సైలెంట్ గా ఉంటుంది. అనుప‌మ ప‌క్క‌న కూర్చొని భోజ‌నం చేయ‌డానికి మ‌ను ఆలోచిస్తాడు. ఇంత కష్టపడి ప్లాన్ చేసిన ఏంజెల్‌ ఎందుకు వదులుతుంది. మను చేయి ప‌ట్టుకొని అనుప‌మ ప‌క్క‌న కూర్చ‌బెడుతుంది. ఇంతలో వసుధార కూడా సీన్లోకి ఎంటర్ అయి, మ‌ను చేత అనుప‌మకు కూర వేయిస్తుంది.

నీకు ఇష్టమైన కూరలు ఏంటి బావ అని ఏంజెల్, మ‌నును అడుగుతుంది. అంతలో అనుపమ గుత్తివంకాయ, ఆలు ఫ్రై, ప‌ప్పు చారు అని స‌మాధానం ఇస్తుంది. ఇక్కడే తెలిసిపోతుంది మను అంటే ఎంత ఇష్టమో.. ఆ తర్వాత ఏంజెల్ మళ్లీ అనుపమను అడుగుతుంది.. మరి మీరు బాగా తినే కూరలు ఏంటి అని.. కాక‌ర‌కాయ ఫ్రై, ప‌ప్పుచారుతో పాటు అప్ప‌డాలు అంటే అమ్మ‌ బాగా తింటుందని మ‌ను చెబుతాడు. మ‌ను, అనుప‌మ కలవాలనే ప్లాన్ కలిసి వస్తుండటంతో వ‌సుధార‌, మ‌హేంద్ర సంతోషపడతారు.

కొంత‌మంది అయితే ఒంట‌రిగానే తింటారు.. ఒంట‌రిగానే బతుకుతారు. మరి కొంత‌మందికి అంద‌రూ ఉన్నా దూరంగా ఉండాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌ని మ‌నుతో అంటాడు మ‌హేంద్ర‌. వాళ్ల బాధ ఎవరికీ చెప్పుకోలేక మనసులోనే దాచుకుంటారని మను అంటాడు. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.

Read More..

Brahmamudi : కుక్కినపేనులా పడి ఉండంటూ అనామికను తీసిపారేసిన అపర్ణ


Next Story