ఆ విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న సమంత ..

by Dishafeatures1 |
ఆ విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న సమంత ..
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న సమయంలో మయోసైటిస్ కారణంగా ఇండస్ట్రీకి లాంగ్ బ్రేక్ ఇచ్చింది. అయినప్పటికీ ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలు పంచుకుంటు అభిమానులకు మాత్రం దగ్గరగానే ఉంటుంది. ఇక అనారోగ్యం నుంచి కోలుకున్న సమంత ఇప్పుడిపుడే మూవీస్‌లో బిజి అయిపొతుంది. అయితే తాజాగా సమంత రెమ్యునరేషన్‌కు సంబందించి ఓ వార్త వైరల్ అవుంతుంది.

ఉన్నట్టుండి రెమ్యునరేషన్ డబుల్ చేసింది సమంత. ఏడాదిగా ఏమి చేయని ఈ బ్యూటీ.. రెమ్యునరేషన్ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ అంటుంది. వడ్డీతో కలిపి మరీ నిర్మాతల నుంచి వసూలు చేయాలని ఫిక్సైపోయింది. తెలుగులో ‘ఖుషీ’ తర్వాత సమంత మరో సినిమా చేయలేదు. కానీ బాలీవుడ్‌లో మాత్రం బిజీగానే ఉన్నారు. అక్కడ ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ చేస్తుంది. అయితే వరుణ్ ధవన్ హీరోగా నటిస్తున్న ఈ సిరీస్‌కి సమంత ఏకంగా రూ.10 కోట్ల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు యాడ్స్‌కు కూడా భారీగానే వసూలు చేస్తుందట. ఇక ఈ విషయం కాస్తా వైరల్ అవుతుండటంతో, పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న సామ్ ఆ మాత్రం డిమాండ్ చేయడంలో తప్పేం లేదంటున్నారు. అందుకే నిర్మాతలు కూడా ఈ అమ్మడు రెమ్యునరేషన్ విషయంలో వెనకాడటం లేదు.


Next Story

Most Viewed