- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కమలాపూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు గ్రామంలో శుక్రవారం యాభై లక్షల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం అదే గ్రామంలోని మహిళా సంఘాలకు 49 లక్షల రూపాయల శ్రీనిధి వడ్డీలేని రుణాల చెక్కులను గ్రూపు సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు రుణ విమోచన కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు, మండల ఇన్చార్జి పెరియాల రవీందర్రావు, ప్రజా ప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story