వేశ్యతో ప్రేమాయణం.. భర్త ఘాతుకం.. ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు

by  |
వేశ్యతో ప్రేమాయణం.. భర్త ఘాతుకం.. ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: వివాహేతర సంబంధాలు కాపురాలను కూల్చివేస్తున్నాయి. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. పరాయివారి మోజులో కట్టుకున్నవారిని కడతేరుస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి ఒక వేశ్యతో ప్రేమలో పడి కట్టుకున్న భార్యనే హతమార్చాలని ప్లాన్ వేశాడు. అందుకోసం ఆయుధాలను కొనుగోలు చేసి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. ఢిల్లీకి చెందిన 36 ఏళ్ల వ్యక్తికి చక్కని కుటుంబం ఉంది. భార్య, ఇద్దరు పిల్లలు.. ఎంతో సంతోషంగా ఉండే ఆ కుటుంబంలో వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది. ఇక ఇటీవలే ఈ నిందితుడు ఒక వేశ్య గృహానికి వెళ్లి అక్కడ ఒక వేశ్యతో ప్రేమలో పడిపోయాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఈ విషయాన్నీ తెలుసుకున్న భార్య నిలదీయడంతో తనకు విడాకులు ఇచ్చేసి పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. దీనికి భార్య ససేమిరా అనడంతో అతడిలో ఉన్న నేరస్థుడు బయటికి వచ్చాడు. ముందు నుంచే నేర ప్రవృత్తి ఉన్న ఆ వ్యక్తిపై 2006, 2011లో ప్రాస్టిట్యూషన్ కేసులు, 2015లో అక్రమ ఆయుధాల కేసు నమోదయ్యాయి. అడ్డుగా ఉన్న భార్యను చంపడానికి భారీ పథకాన్నే రచించాడు. కొద్దిరోజుల క్రితం రూ. 50000 పెట్టి రెండు పిస్టల్స్, బుల్లెట్లు కొనుగోలు చేశాడు. వాటితో పాటు మరిన్ని ఆయుధాలు కొనుగోలు చేశాడు.

ఆయుధాలు సరఫరా చేస్తునట్లు సమాచారం అందడంతో రైడ్ కి వెళ్లిన పోలీసులకు నిందితుడు అడ్డంగా బుక్కయ్యాడు. అతడిని అరెస్ట్ చేసి విచారిస్తే నిజం బయటపడింది. అతడు ఈ తుపాకీ, బుల్లెట్లు ఎందుకు కొనుగోలు చేశావని అడుగగా, తన భార్యను చంపేందుకు ఆయుధాలు కొనుగోలు చేశానని తెలుపడంతో షాక్ అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడికి ఆయుధాలను అమ్మిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.


Next Story

Most Viewed