మటన్ తింటుండగా వ్యక్తి మృతి.. కారణం ఎముక

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్ డెస్క్: మాంసం తింటుండగా గొంతులో ఎముక ఇరుక్కుని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గద్వాల జిల్లాలోని గుట్టు మండలం లింగాపురంలో ఆదివారం ఓ వ్యక్తి మాంసం తింటున్నాడు. ఈ సమయంలో ఓ ఎముక అతడి గొంతులో ఇరుక్కుంది. దీంతో ఆ వ్యక్తి మృతిచెందాడు. మృతుడి వయస్సు 40 సంవత్సరాలు అని తెలిసింది. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.</p>

మటన్ తింటుండగా వ్యక్తి మృతి.. కారణం ఎముక
X

దిశ, వెబ్ డెస్క్: మాంసం తింటుండగా గొంతులో ఎముక ఇరుక్కుని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గద్వాల జిల్లాలోని గుట్టు మండలం లింగాపురంలో ఆదివారం ఓ వ్యక్తి మాంసం తింటున్నాడు. ఈ సమయంలో ఓ ఎముక అతడి గొంతులో ఇరుక్కుంది. దీంతో ఆ వ్యక్తి మృతిచెందాడు. మృతుడి వయస్సు 40 సంవత్సరాలు అని తెలిసింది. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Next Story