దారుణం.. తాగిన మైకంలో ఊహించని పని చేసిన వ్యక్తి

by  |
suicide
X

దిశ, అమీన్ పూర్: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తాగిన మైకంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన అమీన్ పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. భద్రుపల్లి వేణు(31), లావణ్య దంపతులు సుల్తాన్‌పూర్‌లో నివాసం ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా మద్యానికి బానిసైన వేణు ప్రతిరోజూ ఇంటికి తాగివచ్చి భార్య లావణ్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం 10 గంటల సమయంలో వేణు మద్యం సేవించి ఇంటికి వచ్చి తన భార్యతో గొడవపడ్డాడు. దీనితో ఆమె తన కుమారినితో తీసకొని ఇంటి నుంచి బయటకు వెళ్లింది.

ఆమెను అడ్డుకుని ఇంట్లోకి రావాలంటూ పిలిచాడు. ఆమె స్పందించకుండా ఇంటి బయట కూర్చోవడంతో తాగిన మైకంలో వేణు ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన భార్య లావణ్య పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళగా, అప్పటికే వేణు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. భార్య లావణ్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ కలీమొద్దీన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.‌

Next Story

Most Viewed