క్వారంటైన్ పూర్తి.. స్వాగతం పలికిన గ్రామస్తులు

by  |
క్వారంటైన్ పూర్తి.. స్వాగతం పలికిన గ్రామస్తులు
X

దిశ, మహబూబ్ నగర్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అధికారులు, వైద్యుల సూచనల మేరకు క్వారంటైన్ వెళ్లి తిరిగి వచ్చిన వారికి ఘనస్వాగతం లభించింది. చప్పట్లతో ఆహ్వానించారు. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలకు చెందిన ఓ కుటుంబానికి కరోనా సోకిందనే అనుమానం వ్యక్తమైంది. వైరస్ లక్షణాలు ఉండటంతో అధికారులు, వైద్యులు ప్రభుత్వ క్వారంటైన్ వెళ్లాలని సూచించారు. ఇందుకు అంగీకరించిన ఆ కుటుంబం 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంది. పరీక్షల్లోనూ నెగిటివ్ రావడంతో వారిని ఇంటికి పంపించారు. ఈ క్రమంలో స్వగ్రామానికి చేరుకున్న వారికి కాలనీవాసులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు స్వాగతం పలికారు.

Tags: carona, negitive, quarantain, local people welcome grandly, claps

Next Story

Most Viewed