గ్రేట్‌ ఇండియన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్న ఈటీ మనీ.. 20 లక్షలు గెలుచుకునే అవకాశం

by Disha Web Desk 13 |
గ్రేట్‌ ఇండియన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్న ఈటీ మనీ.. 20 లక్షలు గెలుచుకునే అవకాశం
X

న్యూఢిల్లీ 2022 : భారతీయులు ఆదా చేసుకోవడం తో పాటుగా పెట్టుబడులు పెట్టడాన్ని ఈ పండుగ సీజన్‌లో ప్రోత్సహిస్తూ.. భారతదేశంలో అతిపెద్ద వెల్త్‌ టెక్‌ యాప్స్‌లో ఒకటైన ఈటీ యాప్‌ ఇప్పుడు మొట్టమొదటిసారిగా గ్రేట్‌ ఇండియన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫెస్టివల్‌ ను ప్రారంభించింది. ఈ వినూత్నమైన కార్యక్రమం ద్వారా ఈటీ మనీ ఇప్పుడు వినియోగదారుల నడుమ చక్కటి ఆర్థిక అలవాట్లు చేసుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది.

దాదాపు 17 రోజుల పాటు జరిగే ఈ పండుగ ద్వారా ఈ యాప్‌ ఇప్పుడు వినియోగదారులకు పండుగ రాయితీలను ఈటీ మనీ జీనియస్‌ పై అందించడంతో పాటుగా ప్రోత్సాహకాలను సైతం అందిస్తుంది. వీటిలో షాపింగ్‌ ఓచర్లు, లైఫ్‌ స్టైల్‌ సబ్‌స్ర్కిప్షన్స్‌, రోజువారీ లక్కీ డ్రాలు, బంపర్‌ ప్రైజ్‌లు సైతం ఉన్నాయి. ఈ ఆఫర్‌లో భాగంగా అందించే భారీ ప్రైజ్‌లలో తాజా ఐ ఫోన్‌ 14 ప్లస్‌ , ఐపాడ్‌ ఎయిర్‌, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఇంటర్‌సెప్టర్‌ బైక్‌ ఉన్నాయి. మదుపరులు 2 లక్షల రూపాయల నగదు సైతం గెలుచుకునే అవకాశం ఉంది. దీనికోసం వారు తమ స్నేహితులు, కుటుంబసభ్యుల నడుమ చక్కటి ఆర్ధిక అలవాట్లును రిఫరల్‌ ద్వారా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.

దశాబ్దాలుగా వినియోగదారులకు ఖర్చు చేయడం, దానికి బదులుగా ఈ పండుగ సీజన్‌లో ప్రోత్సాహకాలను అందుకోవడం జరిగిందని ఈటీ మనీ నమ్ముతుంది. భారతదేశం ఇప్పుడు పెట్టుబడుల సంస్కృతిని స్వీకరించడం వల్ల పెట్టుబడులు, పొదుపుపై సైతం ప్రోత్సాహకాలు ఉండాలని ఇది భావిస్తుంది.

గ్రేట్‌ ఇండియన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫెస్టివల్‌ ప్రారంభించడం గురించి ఈటీ మనీ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ ముకేష్‌ కల్రా మాట్లాడుతూ ''మనకు వాస్తవంగా అవసరం లేనప్పటికీ పండుగ సీజన్‌లో ఆఫర్లు, రాయితీలు లభించడం వల్ల మనలో చాలామంది ఈ సీజన్‌లో కొనుగోళ్లు జరుపుతుంటారు. దీని కారణంగా మన నెలవారీ బడ్జెట్స్‌పై ప్రభావం పడటంతో పాటుగా భావి ఆర్థిక ప్రణాళికలు, పొదుపు లక్ష్యాలు సైతం ప్రభావితమవుతాయి. భారతీయులు తెలివిగా పెట్టుబడులు పెట్టడాన్ని ప్రోత్సహిస్తూ ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫెస్టివల్‌ ప్రారంభించాము. దీని ద్వారా పెట్టుబడులు పెట్టడమనేది శాశ్వత అలవాటుగా మారుస్తున్నాము. దీనికి పండుగ సీజన్‌ను ఆరంభంగా చేసుకున్నాము. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు దీర్ఘకాలపు సంపద సృష్టించుకోగలరని నమ్ముతున్నాము'' అని అన్నారు.

ఈటీమనీ యొక్క గ్రేట్‌ ఇండియన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫెస్టివల్‌ ఇప్పుడు వినూత్నమైన రివార్డ్స్‌ రిఫరల్స్‌ ద్వారా ఒకరి స్నేహితులు, కుటుంబసభ్యులు చక్కటి పెట్టుబడుల అలవాటు చేసుకోవడాని ప్రోత్సహిస్తుంది. ఈ విధంగా మరింత మంది భారతీయులు సంపద సృష్టి ప్రయాణంలో పాల్గొనడంతో పాటుగా పెట్టుబడులలో వేసే తొలి అడుగుతోనే వారు పోత్సాహకాలు, ప్రత్యేక రాయితీలు, రాయితీతో ఈటీ మనీ జీనియస్‌ సభ్యత్వం,లక్కీ డ్రా బహుమతులు, బంపర్‌ బహుమతులు సైతం గెలుచుకోగలరు.


Next Story

Most Viewed