భారతదేశంలో మినీ టిబెట్.. అక్కడి అందాలు చూశారంటే కళ్లు తిప్పుకోలేరు..

by Disha Web Desk 20 |
భారతదేశంలో మినీ టిబెట్.. అక్కడి అందాలు చూశారంటే కళ్లు తిప్పుకోలేరు..
X

దిశ, ఫీచర్స్ : భారతదేశం వైవిధ్యత కలిగిన దేశం, ఇక్కడ వివిధ మతాల ప్రజలు ఎంతో ప్రేమ, ఆప్యాయతతో కలిసి జీవిస్తారు. ప్రకృతిపరంగా విదేశాల్లోని అనేక ప్రసిద్ధ ప్రదేశాలకు పోటీగా ఇక్కడ అనేక ప్రదేశాలు ఉన్నాయి. మనదేశంలోని ఢిల్లీ, లక్నో, లాంటి నవాబుల నగరాలు ప్రసిద్ధి చెందాయి. అలాగే భారతదేశంలో మినీ టిబెట్ అని కూడా పిలిచే ఒక రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రం దాని అందంతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని ఈ మినీ టిబెట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలోని అందమైన ఒడిషా నగరంలో ఉన్న చంద్రగిరి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన ప్రదేశం. ఇది పర్వతాలు, అందమైన దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు.

ఒడిశా భారతదేశంలోని అందమైన, మనోహరమైన రాష్ట్రాలలో ఒకటి. ఇక్కడ ఉన్న ఆకర్షణీయమైన బీచ్‌లు, చారిత్రాత్మక దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలు ఒడిశా అందాన్ని ఇనుమడింపజేస్తాయి. ఇక్కడ మీరు మినీ టిబెట్ మాత్రమే కాకుండా జగన్నాథ్ పూరి ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం, చిల్కా సరస్సు, ఉదయగిరి, ఖండగిరి గుహలను కూడా సందర్శించవచ్చు. వాటిని తిలకించేందుకు ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఒడిశాకు వస్తుంటారు.

భారతదేశంలోని మినీ టిబెట్ - చంద్రగిరి..

చంద్రగిరి ఒడిశాలోని గజపతి జిల్లాలో ఉంది. చాలా మందికి జిరాంగ్ అనే పేరు కూడా తెలుసు. చంద్రగిరిని మినీ టిబెట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ జనాభాలో సగానికి పైగా టిబెటన్ ప్రజలు నివసిస్తున్నారు. అందుకే ఇక్కడికి వెళ్లినప్పుడు టిబెట్‌కు వచ్చినట్లు అనిపిస్తుంది. అందకే ఒడిశాలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా. పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్న చంద్రగిరిలో పచ్చదనానికి కొదవలేదు. ప్రజలు ప్రశాంతమైన క్షణాలను గడపడానికి నగరం సందడి నుండి దూరంగా పర్వతాల మధ్య ఉన్న చంద్రగిరికి వస్తారు. అనేక చారిత్రక బౌద్ధ ఆరామాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అందుకే మతపరమైన ప్రదేశాలను అన్వేషించడానికి ఇష్టపడే వ్యక్తులు కూడా ఈ స్థలాన్ని ఇష్టపడతారు. స్థానిక ప్రజలకు ఈ బౌద్ధ విహారం స్వర్గ ద్వారం కంటే తక్కువ కాదు. చంద్రగిరి బౌద్ధ విహారం లోపల, సుమారు 23 అడుగుల ఎత్తైన బుద్ధుని కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు.

మహేంద్రగర్ గ్రామం..

చంద్రగిరి చుట్టూ అనేక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు ఉన్నప్పటికీ, ఇక్కడ మహేంద్రగిరి పర్వతం అత్యంత ప్రసిద్ధమైనది. ఇది ఒడిశాలోని రెండవ ఎత్తైన శిఖరం. అనేక పురాణ కథల ప్రకారం దీనిని పవిత్ర పర్వతం అని కూడా అంటారు. పరశురాముడు మహేంద్రగిరి పర్వతం పై ధ్యానం చేసేవాడని స్థానికులు నమ్ముతారు. ఈ పర్వతం అంతరించిపోయిన అనేక రకాల ఔషధ మొక్కలకు కూడా ప్రసిద్ధి చెందింది. కొండకు సమీపంలో ఉన్న మహేంద్రగఢ్ గ్రామం పచ్చదనానికి ప్రసిద్ధి. మహేంద్రగఢ్‌తో పాటు, ఈ ప్రదేశాన్ని మినీ టిబెట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇక్కడ దాదాపు ప్రతి ఇంటి గోడ పై బుద్ధ భగవానుడికి సంబంధించిన చిత్రాలు ఖచ్చితంగా ఉంటాయి.


Next Story

Most Viewed