ఫ్రాన్స్‌కు బయలుదేరిన కేటీఆర్ బృందం.. ఎందుకో తెలుసా.?

by  |
minister ktr
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరుగనున్న పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రతినిధి బృందం బయలుదేరింది. ఫ్రెంచ్ సెనేట్‌లో జరిగే యాంబిషన్ ఇండియా-2021 కార్యక్రమంలో ఈ నెల 29న మంత్రి కేటీఆర్ కీలక ఉపన్యాసం చేయనున్నారు. పలువురు ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు, సీఈఓలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. మంత్రితో పాటు ప్రతినిధి బృందంలో ఐటి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజాన్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

Next Story

Most Viewed