ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి పెట్టాలి: కేటీఆర్

by  |
ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి పెట్టాలి: కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భారీగా పెరిగిన సాగునీటి సౌకర్యాల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ ఫామ్ పంటల సాగు వైపు రైతులు ఆలోచించాలన్నారు. బుధవారం సిరిసిల్లలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన ఎఫ్ జీ వి కంపెనీ ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు.

కంపెనీకి చెందిన సత్యనారాయణ ఆయిల్ఫామ్ పంటలకు తెలంగాణలో మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇంత భారీ ఎత్తున ఆయిల్ఫామ్ పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయం లాభసాటిగా మారడంతో పాటు వేలాది మందికి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలలో ఉపాధి లభిస్తుందన్నారు. ఆయిల్ ఫామ్ కి సుప్రసిద్ధమైన మలేషియా దేశంలో తమ కంపెనీ చేస్తున్న ఆయిల్ఫామ్ సాగు, ప్రాసెసింగ్ వంటి అంశాలపైన అధ్యయనం చేసేందుకు అక్కడ పర్యటించాలని ఆహ్వానించారు. తన నియోజకవర్గం సిరిసిల్లలో భారీ ఎత్తున ఆయిల్ఫామ్ పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహించాలన్న ఆలోచనతో ఉన్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి తప్పకుండా మలేషియాలో పర్యటించి ఆయిల్ ఫామ్ పంటల సాగుపై అధ్యయనం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు. సిరిసిల్లతో పాటు మరికొన్ని చోట్ల రాష్ట్రంలో ఆయిల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు ముందుకు వచ్చిన కంపెనీ యాజమాన్యాన్ని అభినందించిన మంత్రి కేటీఆర్.. సిరిసిల్లలో ఫ్యాక్టరీ తో పాటు సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ , ఆయిల్ ఫామ్ మొక్కల నర్సరీని కూడా ఏర్పాటు చేయాలని కోరారు.

Next Story

Most Viewed