- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: ప్రకాశం జిల్లా టంగుటూరులో తల్లీ, కూతుర్లు దారుణ హత్యకు గురయ్యారు. బంగారం వ్యాపారి జలదంకి రవికిషోర్ భార్య శ్రీదేవి(43), కుమార్తె వెంకట లేఖన(21)లను గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి గొంతు కోసి చంపేశారు. రవికిషోర్ సింగరాయకొండ రోడ్డులో ఆర్.కె.జ్యుయెలర్స్ పేరిట బంగారు దుకాణం నిర్వహిస్తున్నాడు. పనిముగించుకుని రాత్రి ఇంటికి వెళ్లి చూసేసరికి భార్యా, కుమార్తెలు అచేతనంగా పడి ఉండటం చూసి బోరున విలపించాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో ఎస్ఐ నాయబ్ రసూల్, సింగరాయకొండ సీఐ ఎం.లక్ష్మణ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. లేఖన ప్రస్తుతం బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. రవికిషోర్ సోదరుడు రంగాకు చెందిన బంగారు దుకాణంలో మూడు నెలల క్రితం సుమారు 800 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఆ కేసు ఇప్పటికీ కొలిక్కిరాలేదు. ఇంతలోనే అదే కుటుంబానికి చెందిన రవికిషోర్ భార్య, కుమార్తె హత్యకు గురికావడంతో కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది.