- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: ఆన్ లైన్ లో పరిచయమైన అతడి మనసు చాలా మంచిది అని నమ్మింది ఆ యువతి. అనంతరం పెద్దలను ఒప్పించి అతడిని పెళ్లి చేసుకుంది. ఇలా నమ్మిన తన భార్యను ఓ ముసలోడికి అమ్మేశాడు ఆ భర్త. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజేష్ అనే ఒడిశాకు చెందిన వ్యక్తి సోషల్ మీడియాలో ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఆ యువతి కూడా అతడిని పూర్తిగా నమ్మింది. ఇలా కొద్ది కాలంపాటు వారు ప్రేమించుకుని, కుటుంబ సభ్యులను ఒప్పించి రెండు నెలల క్రితం వారు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయినంక పని కోసమని అతను తన భార్యను తీసుకొని రాజస్థాన్ వెళ్లాడు. అక్కడ ఓ ఇటుక బట్టీలో పనిచేస్తూ ఉన్నారు. అయితే, తనను నమ్మి తన వెంట వచ్చిన భార్యను బరన్ జిల్లాకు చెందిన ఓ వృద్ధుడికి రూ. లక్షా 80 వేలకు అమ్మేశాడు. ఆ డబ్బులతో ఎంజాయ్ చేశాడు.
భార్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కూతురు ఎవరితోనో లేచిపోయిందని చెప్పాడు. అల్లుడి మాటలు విని వారు ఒక్కసారిగా షాకయ్యారు. తమ కూతురు అలాంటిది కాదని, అల్లుడిపై డౌట్ వస్తోంది అంటూ వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా అల్లుడిగారి అసలు రూపం బయటపడింది. విచారణ నిమిత్తం ఒడిశా నుంచి రాజస్థాన్ కు వచ్చిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. భర్తే తన భార్యను వృద్ధుడికి అమ్మేశాడని విచారణలో తేలింది. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు.