కలెక్టర్, ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

by  |
Telangana High Court
X

దిశ,వెబ్‌డెస్క్: మంచిర్యాల కలెక్టర్ భారతి హోలీ కేరి,ఎమ్మెల్యే చిన్నయ్యకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే, కలెక్టర్‌లతో పాటు మరో ఐదుగురికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రూ.90లక్షల డీఎంఎఫ్టీ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ వెంచర్‌కు రోడ్లు వేశారంటూ హై కోర్టులో బీజేపీ నేతలు పిటిషన్ వేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రతివాదులకు హై కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 22కు తెలంగాణ హై కోర్టు వాయిదా వేసింది.


Next Story

Most Viewed