క్షీణిస్తున్న నాయిని ఆరోగ్యం

by  |
క్షీణిస్తున్న నాయిని ఆరోగ్యం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోంది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రస్తుతం వైద్యానికి కూడా స్పందించడం లేదని వైద్యులు తెలిపారు. అయితే సెప్టెంబర్ 28వ తేదీన నాయినికి కరోనా సోకింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత కరోనా నెగిటివ్‌గా తేలడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం మళ్లీ విషమించడంతో మళ్లీ ఆస్పత్రిలో చేర్చారు. కాగా ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు.. పలువురు టీఆర్ఎస్ నేతలు ఆయను పరామర్శించారు.


Next Story

Most Viewed