బీసీలకు కన్నతల్లి టీడీపీ.. వైసీపీ సవతి తల్లి

by Disha Web Desk 16 |
బీసీలకు కన్నతల్లి టీడీపీ.. వైసీపీ సవతి తల్లి
X

బీసీలను జగన్ మోసపురెడ్డి వెన్నుపోటు పొడిచారు

- ట్విట్టర్లో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీలకి కన్నతల్లి తెలుగుదేశం పార్టీ అయితే సవతి తల్లి వైసీపీ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. పదవులన్నీ సొంత సామాజికవర్గానికి కట్టబెట్టి వెనకబడిన తరగతులకు జగన్ మోసపు రెడ్డి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ట్వీట్ చేశారు. పదో తరగతి ప్రశ్నాపత్రం ఎత్తుకెళ్లిన బుద్ధి ఇంకా పోలేదని విమర్శించారు. వెనకబడిన వర్గాలకు ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలిచే తెలుగుదేశం పార్టీ కార్యక్రమం'జయహో బీసీ' పేరూ ఎత్తుకుపోయారని విమర్శించారు. బీసీల పదవులు, నిధులు దోచేసి.. రిజర్వేషన్లు కోసేసిన బీసీల ద్రోహి జగన్ రెడ్డికి బీసీల పేరెత్తే అర్హత లేదని అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు.


Next Story

Most Viewed