- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
బెంగళూరు: కర్ణాటకలో దేశంలోనే తొలి ఉచిత ప్లాస్మా బ్యాంకు ఏర్పాటు చేస్తున్నారు. బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్లో ఈ బ్యాంకును ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర అధికారులు వెల్లడించారు. సాయి కృష్ణ చారిటబుల్ ట్రస్టుతో కలిసి ఈ బ్యాంకును నిర్వహించబోతున్నట్టు తెలిపారు. తొలుత ఇది డోనర్లకు మాత్రమే తెరిచి ఉంటుందని, సరిపడా దాతలు లభించినతర్వాత కరోనా పేషెంట్ల కోసం ఉచితంగా ఈ ప్లాస్మా బ్యాంకు సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. కరోనా నుంచి కోలుకున్నవారి నుంచి యాంటీబాడీలు సేకరించి కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరపీ విధానంలో అందించి చికిత్స చేస్తారు. ఇటీవలే ప్లాస్మా డొనేట్ చేయాలని కర్ణాటక సర్కారు కరోనా నుంచి కోలుకున్నవారిని అభ్యర్థించిన సంగతి తెలిసిందే. వారికి ప్రోత్సాహకంగా రూ. 5,000లను అందజేయనున్నట్టు ఇటీవలే ప్రకటించింది.
Next Story