ఒకే జైలులో 85 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ

by  |
ఒకే జైలులో 85 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకే జైలులో 85 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ పాజిటివ్ గా తేలిన ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. అస్సాంలోని నౌగావ్ జిల్లా సెంట్రల్ జైల్లో గత నెలలో ఖైదీలకు హెచ్‌ఐవీ టెస్టులు చేశారు. తాజాగా టెస్టు రిజల్ట్స్ రాగా.. 85 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ సోకినట్లు తేలింది. దీంతో జైలు అధికారులు విస్తుపోయారు. ఈ 85 మంది డ్రగ్స్‌కు అలవాటుపడ్డారని, డ్రగ్స్ తీసుకునేటప్పుడు వాడిన సిరంజీల కారణంగానే ఒకరి నుంచి మరొకరికి హెచ్‌ఐవీ సోకి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed