స్టేటస్‌లో నిండుగా.. దిశ కథనమే మెండుగా

by  |
స్టేటస్‌లో నిండుగా.. దిశ కథనమే మెండుగా
X

దిశ,మక్తల్ : నారాయణపేట జిల్లా మక్తల్‌ లో షేర్ మార్కెట్ల పేరుతో అమాయక ప్రజలను మోసం చేసి వంద కోట్ల రూపాయలతో ఉడాయించిన మోసగాడికి సంబంధించిన కథనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం పాఠకులకు విదితమే.

ఈ కథనాన్ని ముందుగా వెలుగులోకి తేవడంతో బాధితులంతా లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో బాధితులతో పాటు మొత్తం నియోజకవర్గంలోని అన్ని మండలాలు,నారాయణపేట జిల్లా కేంద్రంలో పలువురు ఈ మోసానికి సరిపడ పాటలను జతచేసి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసుకుంటున్నారు. దీనితో దిశ ప్రత్యేకత దశదిశలా వ్యాప్తి స్తోంది అని చెప్పడానికి గర్విస్తున్నాం.

Next Story