- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
'కి'లేడీ.. ఇంట్లో అద్దెకు ఉంటూ ఓనర్కే స్కెచ్..
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలి కంట్లో కారం చల్లి ఆమె మెడలో నుంచి గొలుసు తెంపుకెళ్లిన మహిళను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నిజామాబాద్ సీపీ నాగరాజు తెలిపారు. గురువారం సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని న్యూ ఎన్జీఓ కాలనీ ప్రాంతానికి చెందిన గంగుబాయి అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. గురువారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఇంట్లోకి ప్రవేశించిన కొందరు ఆమె కంట్లో కారం చల్లి మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు గొలుసును అపహరించుకుని వెళ్లారు. స్థానికులు డయల్ 100 కు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న మూడవ టౌన్ పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు ఆధారంగా విచారిస్తుండగా అందులో గంగుబాయి ఇంట్లోకి ఇంటిపైన అద్దెకు ఉండే రాజుబాయి ఆలియాస్ రాజమణి వచ్చినట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా తానే ఈ నేరానికి పాల్పడినట్లు అంగీకరించిందని సీపీ తెలిపారు. ఆమె ఇంట్లో నుంచి గంగుబాయి మెడలో తెంపుకెళ్లిన రెండున్నర తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ పేర్కొన్నారు. కేసును గంటల వ్యవధిలో చేధించిన నిజామాబాద్ ఏసీపీ ఆధ్వర్యంలో నగర సీఐ, మూడవ టౌన్ ఎస్సై సాయినాథ్లను సీపీ అభినందించారు.