శ్రద్ధ వాకర్ మర్డర్: అఫ్తాబ్‌లో కనిపించని పశ్చాతాపం

by Disha Web Desk 4 |
శ్రద్ధ వాకర్ మర్డర్: అఫ్తాబ్‌లో కనిపించని పశ్చాతాపం
X

దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ లో పశ్చాతాపం కనిపించలేదని పోలీసులు తెలిపారు. అత్యంత కిరాతకంగా చంపిన తర్వాత మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసిన ఘటన ఇటీవల ఆలస్యంగా వెలుగు చూసింది. మహారాష్ట్ర లోని మానిక్ పూర్ పోలీసులు ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టారు. శ్రద్ధా వాకర్ కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా అఫ్తాబ్ ను పోలీసులు రెండు సార్లు విచారణకు పిలిచారు. ఎంక్వైరీ సందర్భంగా తాను శ్రద్ధాను గతంలోనే విడిచిపెట్టానని, తాము కలిసి ఉండటం లేదని అఫ్తాబ్ తెలిపినట్లు అసిస్టెంట్ పోలీసు ఇన్స్ పెక్టర్ సంపత్ రావు పాటిల్ తెలిపారు.

Next Story

Most Viewed