బిగ్ బ్రేకింగ్: సతిగూడ జలాశయంలో నాటుపడవ బోల్తా.. ఇద్దరు గల్లంతు

by Disha Web Desk |
బిగ్ బ్రేకింగ్: సతిగూడ జలాశయంలో నాటుపడవ బోల్తా.. ఇద్దరు గల్లంతు
X

దిశ, ఉత్తరాంధ్ర : ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో స‌తిగూడ జ‌లాశ‌యంలో పడవ ప్రమాదం జరిగింది. నాటుపడవలో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు గ‌ల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఒక‌రి మృత‌దేహం పోలీసులకు లభ్యమైంది. నాటుపడవతో ఇద్దరు చేపల వేటకు వెళ్లిన సమయంలో హఠత్తుగా నది ప్రవాహం వేగం పెరిగింది. ఈ క్రమంలో పడవ అదుపు తప్పి బోల్తా పడింది. ఇద్దరు గల్లంతయ్యారన్న సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా మ‌హిళ మృత‌దేహం ల‌భ్యం అయ్యింది. మ‌రొక వ్యక్తి కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి.


Read More 2023 Telangana Legislative Assembly election News
For Latest Government Job Notifications
Follow us on Google News




Next Story